మానవత్వపు విలువల ప్రబోధం రంజాన్ మాసం

రంజాన్

ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ పండుగను పవిత్రంగా జరుపుకొంటున్న ముస్లిం మత విశ్వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవత్వపు విలువలను ప్రబోధించే దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసం ఎంతో పవిత్రమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని అనుసరిస్తే ఆ సమాజం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది. తద్వారా ఆ దేశంలో ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయి. ఇటువంటి సన్మార్గాన్ని చూపించేదే దివ్య ఖురాన్. సమాజంలో అసమానతలు తొలగినప్పుడే ఆ సమాజం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన సంపాదనలో కొంత మేర అవసరార్థులకు పంచినప్పుడే అసమానతలు తొలగిపోయేది. అటువంటి దాన గుణంతోపాటు సేవ, సత్య నిష్ఠ, ధార్మిక చింతన వంటి సుగుణాలను అందించిన ఈ రంజాన్ సందేశం ఇస్లాం మత విశ్వాసులకు ఒక గొప్ప వరం. వారందరికీ ఈ పండగ తరుణాన శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్