ఉచితాలు కాదు ఉపాధి మార్గం చూపించండి

ఉచితాలు

• డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై సమాధానం చెప్పేవారేరి?
• ఇదీ… మహిళాగళం
• వారాహి విజయయాత్రలో భాగంగా ముమ్మిడివరం వీరమహిళలతో సమావేశమైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

             వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు వేరుశె’నగ చిక్కీలు ఇస్తున్నారు. ఎక్కడో తయారు చేసినవి ఇస్తుండటంతో అవి పాడైపోతున్నాయి. నాణ్యత ఉండటం లేదు. స్థానికంగా ఉండే స్వయం సహయక మహిళ సంఘాలకు ఈ చిక్కీలు తయారు చేసే బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు తాజాగా ఉండటంతోపాటు అందాల్సిన పోషకాలు పిల్లలకు అందుతాయి. దీనిని వైసీపీ ప్రభుత్వం మరిచిపోయింద’ని మహిళలు తమ ఆలోచనను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. ఉచితాలు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే రాష్ట్రం అప్పులు పాలు కాదని చెప్పారు. పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఆ భవనాలు కూలిపోతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం ముమ్మిడివరంలో జనసేన వీరమహిళలతో శ్రీ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాయి. మహిళలు క్షేత్రస్థాయిలో సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలు దాచుకున్న పొదువు సొమ్ము గురించి ప్రశ్నిస్తే రకరకాల కారణాలు చెబుతున్నారని, ఆ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కనీసం పొదుపు సొమ్ము మీద లెక్కలు చూపడానికి కూడా క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థ లేదన్నారు. అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలకు నాణ్యమైన చదువు రాదని నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు మంచి చదువు వస్తుందని ఈ సందర్భంగా వీరమహిళలు తమ మనసులోని మాటను చెప్పారు. వీటితో పాటు దశాబ్ధాలుగా స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు అన్ని సావధానంగా విన్న శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతానుసారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్